Home >>> వైరల్ > ఫోన్ కోసం కొట్టి చంపేసిన బాలుడు
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మొబైల్ ఫోన్ విషయంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తిని బాలుడు కొట్టి చంపేయడం ఆశ్చర్యం కలిగించింది. మైనర్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడు తన స్నేహితుడు షకీర్ మొబైల్ ఫోన్ను దొంగిలించి అమ్ముకున్నాడు. షకీర్ తన మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని బాలుడిని అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఆదివారం వీరిద్దరూ కలిసి మద్యం సేవించినప్పుడు... షకీర్ తన మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని బాలుడిని మరోసారి కోరగా, డబ్బు లేదని అతను చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి... నిందితుడు షకీర్పై ఇటుకతో దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. షాకీర్ మరియు నిందితులు ఇద్దరూ మద్యానికి బానిసలు అయ్యారని... ఆ మద్యం తాగే సమయంలోనే ఇద్దరి మధ్య వివాదం పెరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఇదే షకీర్ మరణానికి దారితీసింది" అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.