Home >>> వైరల్ > బైక్ పై తిరుమల వెళ్తున్నారా...? అయితే ఇది తెలుసుకోండి...!
తిరుమల ఘాట్ రోడ్ లో టూ వీలర్స్ పై ఆంక్షలు ఆంక్షలు విధించారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకే రెండు ఘాట్ రోడ్డులలో బైక్ లకు అనుమతి ఇచ్చారు. నేటి నుంచి సెప్టెంబర్ 30 వరకు అమలులో ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా తెల్లవారు జామున 4 నుంచి రాత్రి 10 గంటల వరకు బైక్స్ రాకపోకలకు అనుమతి ఉంది. నిన్న రాత్రి 9 గంటల సమయంలో మొదటి ఘాట్ రోడ్డులోని ఎన్ ఎస్ టెంపుల్ వద్ద 54 వ క్రాస్ లో చిరుత కనపడింది.
ఘాట్ రోడ్డు ను క్రాస్ చేస్తున్న చిరుత ను భక్తులు గుర్తించారు. టిటిడి సెక్యూరిటీ, ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చర్యలు చేపట్టారు. వైల్డ్ అనిమల్స్ బ్రీడింగ్ సమయం కాబట్టి ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించాలని ఫారెస్ట్ అధికారులు సూచించడంతో ఘాట్ రోడ్డులో బైక్స్ రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ టిటిడి, ఫారెస్ట్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.